మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిచాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గుండాలగడ్డ తండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లూనావత్ దస్మా, అతడి కొడుకు మధన్, అమనగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు కావటి జనార్దన్, సందీప్రెడ్డి, ఐలయ్య, యాకన్న, రంగమ్మ, సురేశ్తోపాటు మరో 100మంది టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే శంకర్నాయక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలు రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయన్నారు. కార్యకర్తలు, నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరికీ అండగా ఉండి, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానన్నారు.
పేదల సంక్షేమమే ధ్యే యం సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని, రాష్ట్రం లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువులను నింపడంతో రైతులు ఏటా రెండు పంటలు పండిస్తున్నారని, వాటికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిం చి కొనుగోలు చేస్తున్నదన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్పై చెడుగా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తు న్న కేసీఆర్కు అండగా నిలబడాలన్నారు. కార్యక్రమం లో పట్టణ యూత్ నాయకులు యాళ్ల మురళీధర్రెడ్డి, నాయిని రంజిత్, సుధగాని మురళి, తేళ్ల శ్రీను, యాస వెంకటరెడ్డి, అశోక్నాయ క్, ఆవుల వెంకన్న, బాలూనాయక్, రమేశ్, వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.