చిన్న జిల్లాలతో ప్రగతి పరిఢవిల్లుతోంది. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016 అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. మొదట వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు ఏర్పాటు కాగా, ఆ తర్వాత కొద్ది మా ర్పులతో 2022 ఆగస్టులో వరంగల్, హనుమకొండ జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. చిన్న జిల్లాలతో అభి వృద్ధికి బాటలు పడి అద్భుత ప్రగతిని సాధించాయి. వరంగల్లో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మితమవుతుండగా, మెగా వస్త్ర నగరిగా కాకతీయ టెక్స్టైల్ పార్కు నిలువనుంది. నర్సంపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలకు, వర్ధన్నపేటలో 100 పడకల దవాఖానకు అడుగులు పడ్డాయి. హనుమకొండలో అత్యద్భుత పాలనా సౌధం అందుబాటులోకి వచ్చింది. పరకాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆ ప్రాంతా నికి ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లయ్యింది.
రాయపర్తి, అక్టోబర్ 10 : కొత్త జిల్లాలతో అందరికీ మేలు జరిగింది. జిల్లాల విభజన కాకముందు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. పూర్వ వరంగల్ జిల్లా మరిపెడ బంగ్లా నుంచి మంగపేట మండలం, జనగామ, పెంబర్తి నుంచి మొదలుకుని హసన్పర్తి, మహబూబాబాద్, భూపాలపల్లి మండలంలోని శివారు గ్రా మాలతో కలిపి ఎంతో విశాలంగా ఉండేది. దీంతో ఉద్యోగులు డ్యూటీలు చేసేందుకు నరకయాతన అనుభవించేది. కుటుంబం ఉండేది రాయపర్తి లో.. మేము మంగపేటలో పనిచేయాలంటే ఇ బ్బంది అయ్యేది. అంతేగాక జిల్లా పెద్దదిగా ఉండడం వల్ల ప్రజలకూ సేవలు అందకపోయేవి. చిన్న జిల్లాలు ఏర్పడ్డాక ఆ బాధలన్నీ తప్పినయ్. ఇప్పుడు సొంత జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్నరు.
వరంగల్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్(నమస్తే తెలంగాణ): చిన్న జిల్లాలతో అభి వృద్ధికి బాటలు పడ్డాయి. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 2016 అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. మొదట 11 మండలాలతో వరంగల్ అర్బన్, పదహారు మండలాలతో వరంగల్ రూరల్ పేర్లతో జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2022 ఆగస్టులో పదమూడు మండలాలతో వరంగల్, 12 మండలాలతో హనుమకొండ జిల్లాలుగా ఆవిర్భ వించాయి. దీంతో గతంలో వరంగల్రూరల్ జిల్లాలో ఉన్న దామెర, ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నడికూడ మండలాలు హనుమకొండ జిల్లాలో కలవగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న వరంగల్, ఖిలావరంగల్ మండలాలు వరంగల్ జిల్లాలో కలిశాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ప్రగతికి బాటలు వేసింది. అన్ని రంగాల్లో జిల్లా అద్భుత ప్రగతి సాధించింది. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వస్త్ర నగరిగా రూపుదిద్దుకుంటున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణంతో వరంగల్ జిల్లా అనేక ప్రత్యేకతలను సంతరించుకొంటుంది.
కొత్తగా ఖానాపురం మండలం అశోక్నగర్ వద్ద 2018 ఆగస్టులో గిరిజన సైనిక్ స్కూల్ ఏర్పడింది. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామం వద్ద ఇటీవల హార్టికల్చర్ రీసెర్స్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రాష్ట్రంలో ఇదే మొదటిది కావటం విశేషం. ఇటీవల వరంగల్లో రూ.80 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ) నిర్మాణానికి మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. అదేరోజు వరంగల్లో మోడల్ బస్ స్టేషన్, ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణానికీ శంకుస్థాపన గావించారు. రోడ్లతో పాటు రహదారుల్లో వాగులు, ఒర్రెలపై వంతెనలు వెలిశాయి. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ల్యాబర్తి, రోళ్లకల్, కల్లెడ తదితర చోట్ల వాగుపై బ్రిడ్జి కమ్ చెక్డ్యాంల నిర్మాణం జరిగింది. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పంట ఉత్పత్తుల నిల్వ కోసం నెక్కొండ, దు గ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లోని వివిధ గ్రా మాల్లో మార్కెటింగ్ శాఖ పెద్ద ఎత్తున గోడౌన్లను నిర్మించింది. రంగాయచెరువు, పాకాల ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం, ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం ప్రా జెక్టు నీటిని చెరువుల్లో నింపు తూ ప్రభుత్వం రైతులు రెండు పంటలు పండించుకునే వసతి కల్పించింది.
గీసుగొండ, సంగెం మండలాల సరిహద్దు గ్రామాలైన శాయంపేట, చింతలపల్లి వద్ద సుమారు 1200 ఎకరాల్లో ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టింది. దీంతో ప్రత్యక్షం, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. వరంగల్లో రూ.1,200 కోట్లతో 2100 పడకల సామర్థ్యం గల 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగంగా నడుస్తున్నాయి. నర్సంపేటలోని 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ స్థాయి పెరిగింది. ఇక్కడ 250 పడుకల స్థాయితో జిల్లా ఆసుపత్రి నిర్మిస్తున్నది. వర్ధన్నపేటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని 100కు పెంచింది. నర్సంపేటకు ప్రభుత్వ మెడి కల్ కాలేజీ మంజూరైంది. ఇక్కడ 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికీ శంకుస్థాపన జరిగింది.వరంగల్ జిల్లాలో 124 కొత్త గ్రామ పంచాయతీలతో మొత్తం 323కు చేరింది. కొత్తగా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయి. వరంగల్లో లక్ష్మీపురం వద్ద ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన పరంగా పర్యవేక్షణ మెరుగైంది. దాని ఫలితాలు ప్రజలకు చేరుతున్నాయి. మున్సిపల్ శాఖతోపాటు రెవెన్యూ ఇతర శాఖల నిత్య పర్యవేక్షణతో వరంగల్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మౌలిక వసతుల పరంగా ఎంతో మెరుగైంది. తాగునీటి సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేని పరిస్థితి వచ్చిం ది. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, నాలా విస్తరణ వంటివి ఎప్పటికప్పుడు వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉండే రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తోంది. జిల్లాల పునర్విభజనతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన చేసిన నేపథ్యంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా చేరుతున్నాయి. హనుమకొండ జిల్లా పరిపాలన కేంద్రం కలెక్టరేట్ సముదాయం రాష్ట్రంలోనే గొప్పగా ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నది. పరకాల రెవెన్యూ డివిజన్ కావడంతో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.