పరకాల, జూలై 25 : సీఎం కేసీఆర్ చొరవతోనే పట్టణంలో వంద పడకల దవాఖాన మంజూరైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల దవాఖానకు కేటాయించిన స్థలాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్థలాన్ని కేటాయించగా అధికారులతో కలిసి హద్దులను నిర్ధారించారు. స్థలంలోని పిచ్చి మొక్కలను తొలగించి చదును చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద పడకల దవాఖాన భవన నిర్మాణం పూర్తయితే మున్సిపాలిటీతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కాగా, పరకాలలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుల కుమారస్వామి కుమారుడు సంతోష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోగా, మృతదేహంపై ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, కౌన్సిలర్లు ఏకు రాజు, అడప రాము, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, నాయకులు నల్లెల్ల అనిల్, శనిగరపు నవీన్, మార్క రఘుపతి, పంచగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముస్త్యాలపల్లిలో..
నడికూడ : మండలంలోని ముస్త్యాలపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తిప్పారపు వీరేశం తల్లి రాజీరమ్మ మృతిచెందగా బాధితులను ఎమ్మెల్యే చల్లా పరామర్శించారు. రాజీరమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ బొట్ల సంధ్యా రవి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.