లెప్రసీ కాలనీవాసులకు అన్నదానం
ప్రారంభించిన చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
వర్షాలు తగ్గేవరకూ బయటకు రావొద్దని సూచన
న్యూశాయంపేట, జూలై 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న హనుమకొండ 10వ డివిజన్ లెప్రసీ కాలనీలోని ముంపు బాధితులకు హోటల్ నిర్వాహకుడు నర్సింహారావు అండగా నిలిచారు. కాలనీలో వారికి గురువారం అన్నదానం నిర్వహించి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ వర్షాలు తగ్గేవరకు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఖలీల్, సుగుణాకర్రెడ్డి, నయీం పాల్గొన్నారు.