వరంగల్, ఆగస్టు 26: భక్తజనంతో భద్రకాళి ఆలయం పోటెత్తింది. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది. భక్తులు క్యూలైన్లలో బారులు తీరగా అమ్మవారిని దర్శించుకునేందుకు గంట సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.