పాలకుర్తి రూరల్, ఫిబ్రవరి 7 : పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పాలకుర్తి మండల కేంద్రంలో కలెక్టర్ శివలింగయ్యతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులతో నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ.16కోట్లతో సోమేశ్వరాలయ అభివృద్ధితోపాటు పర్యాటక పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఈ నెల 12 నుంచి 21 వరకు నిర్వహించే మహా శివరాత్రి జాతర, చండీమాత విగ్రహ ప్రతిష్ఠాపన, శివపార్వతుల కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
జాతర సందర్భంగా రోడ్లు అద్దంలా మెరవాలని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అధికారులను డిప్యుటేషన్పై వేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ను బమ్మెరకు తీసుకొచ్చి పర్యాటక పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఓట్ల కోసమే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హిందూత్వ జెండా మోస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇక్కడి ఆలయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపిస్తారు.., కానీ, అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 12 నుంచి 21 వరకు నిర్వహించే మహా శివరాత్రి జాతర, చండీమాత విగ్రహ ప్రతిష్ఠాపన, శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పాల్కురికి సోమనాథుడి విగ్రహ ఏర్పాటు పనులు, మిషన్ భగీరథ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు, జాతర నిర్వహణపై పాలకుర్తి మండల కేంద్రంలోని మాంగళ్య గార్డెన్లో కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్దేశాయ్తో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులతో నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రూ.16కోట్లతో పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధితోపాటు పర్యాటక పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ సహకారంతో ఆలయాలు, చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నామన్నారు. రూ.25కోట్లతో పాలకుర్తిలో హరిత కాకతీయ హోటల్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మహాభాగవత సృష్టికర్త పోతనామాత్యుడు, తొలి తెనుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు, రామాయణ గ్రంథకర్త వాల్మీ కి మహాముని వంటి కవులు నడయాడిన నేల పాలకుర్తి ప్రాంతమన్నారు. బమ్మెర, పాలకుర్తి, వల్మిడి, సన్నూరు, వానకొండయ్య గుట్ట, చెన్నూరు త్రికూటాలయాల అభివృద్ధికి రూ.60కోట్లు మం జూరు చేశామన్నారు. ఈ నెల 16,18న పాలకుర్తి ఆలయంలో, 24న నాంచారిమడూరులో శివాలయంలో, 26న పాలకుర్తి మండల కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు గుడి శంకుస్థాపన కార్యక్రమాలకు నియోజకవర్గం నుంచి ప్రజలు కదిలిరావాలని పిలుపునిచ్చారు.
పర్వతగిరిలో శివాలయాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించినట్లు తెలిపారు. రోడ్లు అద్దంలా మెరవాలని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు. జాతర కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అధికారులను డిప్యుటేషన్పై వేయాలని ఆదేశించారు. రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండిం గ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతరలో లైటింగ్ అదిరిపోవాలన్నారు. పాలకుర్తి చుట్టూ స్వాగత తోరణాలు కట్టాలన్నారు. అన్నదానం సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బమ్మెరకు సీఎం కేసీఆర్ను తీసుకొస్తా..
మహా భాగవత సృష్టికర్త బమ్మెర పోతన అంటే సీఎం కేసీఆర్కు ఎంతో అభిమానమని మంత్రి అన్నారు. పోతన పద్యాలను సీఎం కేసీఆర్ మధురంగా పాడుతారని, ఆయ న స్వయంగా వచ్చి పోతన స్మృతివనానికి నిధులు మంజూ రు చేసి, భూమిపూజ చేశారని గుర్తు చేశారు. బమ్మెరలో బాసర తరహాలో సరస్వతీ మాత ఆలయం, పోతన స్మృతి వనాన్ని ఏర్పాటు చేశామన్నారు. రూ.15కోట్లతో పలు అ భివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేసీఆర్ను బమ్మెరకు తీసుకొచ్చి పర్యాటక పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
ఓట్ల కోసమే బీజేపీ హిందూత్వ నినాదం
ఓట్ల కోసమే ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు హిందూత్వ జెండా మోస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇక్కడి ఆలయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపిస్తారు.., కానీ, అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వరని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో యాదా ద్రి ఆలయం అద్భుతంగా పునరుద్ధరించబడిందన్నారు. కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శివుడికి, విష్ణువుకి ఒకే చోట కల్యాణం జరిగే ఏకైక ఆలయం సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయన్నారు. ఈ సారి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీసీపీ సీతారాం, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ అల్లమనేని సురేందర్రావు, డీఈ జీవన్కుమార్, డీపీవో వసంత, డీఆర్డీవో రాంరెడ్డి, జిల్లా వైద్యాధికారి మహేందర్, సుగుణాకర్రాజు, ఎస్ఈ వేణుమాధవ్, డీఈ హుస్సేన్నాయక్, ఏడీఈ శ్రీధర్రావు, ఏసీపీ శ్రీనివాసరావు, పీఆర్ ఎస్ఈ రఘువీరారెడ్డి, ఈఈ చంద్రశేఖర్,డీఈ చారి, మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, సంధ్యారాణి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్ పాల్సింగ్, ఎంపీడీవో అశోక్కుమా ర్, దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రాంచంద్రయ్యశర్మ, ఎంపీపీలు నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీలు పల్ల భార్గవీసుందర్రామిరెడ్డి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, శ్రీరాంజ్యోతిర్మయి, సత్తమ్మ, ఐలయ్య, నవీన్, తీగల దయాకర్, జీసీసీ మాజీ చైk్మన్ గాంధీ, జ్యోతి, నెహ్రూ, సోమనర్సింహారెడ్డి, సర్పం చ్ యాకాంతారావు, ఈవో రజినీకుమారి, అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ, దేవగిరి రామన్న శర్మ, నర్సింహారెడ్డి, ప్రశాంత్, సీఐ సంతోష్రెడ్డి, విశ్వేశ్వర్ పాల్గొన్నారు.