జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 5(నమస్తేతెలంగాణ)/ కృష్ణకాలనీ, అక్టోబర్ 5 : భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ పాలించే సత్తా కేవలం సీఎం కేసీఆర్కే ఉందంటూ జిల్లాలోని అన్ని మండలాలతో పాటు గ్రామాల్లో ప్రజలు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు. భారత రాష్ట్రీయ సమితి ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రంలో పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కొన్ని గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. భూపాలపల్లి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్ పాల్గొని అంబేద్కర్ సెంటర్లో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయదశమి రోజున జాతీయ పార్టీని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీ దేశంలో మత ఘర్షణలు కలిగిస్తూ విద్వేశపూరిత పాలన కొనసాగిస్తోందన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక పాలన కొనసాగిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్న బీజేపీని గద్దె దించి, బీఆర్ఎస్ను కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, కౌన్సిలర్లు నూనె రాజు పటేల్, జక్కం రవికుమార్, ముంంజాల రవీందర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు ఇర్ఫాన్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షు డు మోకిడి అశోక్, అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు గౌడ్, నాయకులు సెగ్గం సిద్ధు, బీబీచారి, పైడిపెల్లి రమేశ్, మేనం తిరుపతి, తిరుపతి గౌడ్, ప్రవీణ్, విజయ్, శ్రీకాంత్ పటేల్, రాకేశ్, ప్రేమ్, ముత్తు, కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.
కృష్ణకాలనీ, అక్టోబర్ 5 : జాతీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్(టీజేఎస్ఎఫ్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఉన్నే దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుం టున్నారన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. టీజేఎస్ ఎఫ్ నాయకులు అభిలాష్రెడ్డి, సందీప్ గౌడ్, గణేశ్, రాములుగౌడ్, బాపురెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహదేవపూర్: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఏర్పాటు ను స్వాగతిస్తూ టీఆర్ఎస్ మంథని నియోజనవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేశ్ ఆదేశాల మేరకు మండ ల కేంద్రంలోని ప్రధాన రహదారిలో నాయకులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఎం.డీ అలీంఖాన్, టౌన్ అధ్యక్షుడు కూరతోట రాకేశ్, ఉప సర్పంచ్ సల్మాన్ఖాన్, వార్డు సభ్యులు సిరంగి రవీందర్, నాయకులు కన్నెబోయిన ఐలయ్య, పోలంపల్లి శ్రీనివాస్, మేరుగు శేఖర్, బీసీ సెల్ అధ్యక్షులు సాగర్ల రాజు, మైనారిటీ అధ్యక్షుడు సాజిత్, రెవెళ్లి రాజశేఖర్, టిల్లు, రవీందర్ పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సంబురాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ అంతటి విజయ, మండల అధ్యక్షుడు గడదాసు సునీల్కుమార్, నాయకులు తుమ్మ మ ల్లారెడ్డి, సప్పిడి రాంనర్సయ్య, కూనూరు మహేశ్, ఖాజాపాషా, బట్టు రమేశ్, గారె ఆనంద్, పల్లా రఘు, ఆరిఫ్, కుమ్మరి చంద్రబాబు, దన్నపునేని కిరణ్, అజ్మత్ఖాన్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
మంగపేట : మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి సంబురాలు జరుపుకున్నారు. బుచ్చంపేటలో పీఏసీఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల సమ్మయ్య, కమలాపురంలో కార్మిక విభాగం ములుగు అధ్యక్షుడు ఖుర్బాన్అలీ పాల్గొన్నారు. రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పచ్చా శేషగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, మల్లూరు ఆలయ చైర్మన్ నూతిలకంటి ముకుందం, సహకార వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, డైరెక్టర్లు సత్యనారాయణ, లక్ష్మణ్రావు, రామకృష్ణ, నర్సింహరావు, మార్పుల వెంకట్రెడ్డి, సోషల్ మీడియా మండ ల ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, మండవ రామకృష్ణ, బుట్టో, ఆయూబ్, కోడం సత్యనారాయణ, మూగల రమేశ్, గ్రామాల అధ్యక్షులు లింగయ్య, రమణ, సుదర్శన్, వీరస్వామి, హరీశ్, ఏకాంతం, రాము, కాటూరి సుగుణ, హరీశ్, తిరుపతి, విష్ణు, సందీప్, జగదీశ్, ప్రసాద్, రాము, కృష్ణదేవరాయ పాల్గొన్నారు.
గోవిందరావుపేట: భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడంపై మండలం లోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ పేరును ప్రకటించే సమయంలో ప్రజలు, నాయకులు టీవీల ముందు కూర్చొని ఆసక్తికరంగా తిలకించారు.
వాజేడు : సీఎం కేసీఆర్తోనే బంగారు భారతదేశం సాధ్యమవుతుందని జడ్పీ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండలంలోని ప్రగళ్లపల్లిలో సర్పంచ్ పూసం నరేశ్కుమార్, ఉపసర్పంచ్ కోటేశ్వరరావు, నాయకులు పాయం శంకర్దయాల్, కుర్సం రాంబాబు, జగదీశ్, భానుప్రకాశ్, అక్షయ్, జయంత్, శాంతమ్మ పాల్గొన్నారు.
వెంకటాపురం (నూగూరు) : బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంపా రాంబాబు, కార్యదర్శి పిల్లారిసెట్టి మురళి, సర్పంచ్ చిడెం యామిలి, జాగృతి మండల అధ్యక్షుడు బాలసానివేణు, అధికార ప్రతినిధి డర్రా దామోదర్, మహిళా అధ్యక్షురాలు పెనుమచ్చ మాధురి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలసానిశ్రీను, జాగర శివాజీయాదవ్, జజ్జరి నారాయనమ్మ, తురం సూరిబాబు, మద్దుకూరి ప్రసాద్, గాందార్ల నాగేశ్వరావు, చిడెం నగేశ్, జక్కుల సమ్మయ్య పాల్గొన్నారు.
టేకుమట్ల : బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై మండల కేంద్రంలో పార్టీ టౌన్ అధ్యక్షుడు బొల్లు సరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. అవినీతి రహిత భారత్ సీఎం కేసీఆర్తోనే సాధ్యం అన్నారు. కార్యక్రమంలో తోట గట్టయ్య, బిల్లకంటి ఉమేందర్రావు, పింగిళి వెంకటేశ్వర్రెడ్డి, బందెల నరేశ్, బొడ్డు సదానందం, మామిండ్ల ఎల్లస్వామి, దొడ్ల కోటి, లింగా రావు, రవి, లక్ష్మణ్, కుమార్, నిమ్మల స్వామి, మారెపల్లి కొమురయ్య, రామస్వామి, సురేందర్రెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి : మండలంలోని పెద్దకొమటిపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గ్రామ అధ్యక్షుడు గడ్డం రాజు, మేర్గు భిక్షపతి, ముత్యాల శ్రీనివాస్, మంద సంజీవరెడ్డి, పెరుగు రాజయ్య, వేశాల రాజు, గండు ఓదెలు, బండి తిరుపతి, ఉడుత కొమురయ్య, మంద నర్సింహారెడ్డి, పద్మయ్య, కొమురయ్య, కొండయ్య పాల్గొన్నారు.
ములుగు, అక్టోబర్ 5(నమస్తేతెలంగాణ): నాడు రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ను ఏర్పాటు చేసి రాష్ర్టాన్ని సాధించి, నేడు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్గా మారుస్తూ ప్రకటన చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. జడ్పీ చైర్మన్, ములుగు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ పథకాలు దేశంలో అమలు కావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు కేసీఆర్కు అండగా నిలుస్తున్నారన్నారు.
20ఏళ్ల క్రితం టీఆర్ఎస్ను చులకన చేసి మాట్లాడిన నాయకులు అదే రీతిలో బీఆర్ఎస్ను సైతం విమర్శిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేశ్, శీలం మధు, తాహెర్పాషా, బైకాని సాగర్, రాజాహుస్సేన్, దాసరి రమేశ్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, నాజర్ఖాన్, భద్రయ్య, స్వరూప, రాజేందర్, సంతోష్, సూరన్న, ఎండీ కాసీం, అంకూస్, సాగర్తో పాటు ములుగు పట్టణ కార్యదర్శి బల్గూరి నవీన్, ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి, నాయకులు పాల్గొన్నారు.