సంగెం, సెప్టెంబర్ 24 : వచ్చే యాసంగి సీజన్లో మెట్ట భూముల్లో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. సంగెంలోని రైతువేదికలో శుక్రవా రం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగిలో వేరుశనగ, జొన్న, మక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయల సాగు చేసుకోవాలని సూచించారు. మండలంలోని లోహిత పెద్ద తండాకు చెందిన రైతు సపావట్ సుందర్ లేపాక్షి రకం వేరుశనగ వేయగా ఎకరానికి ఇరవై మూడున్నర క్వింటాళ్ల దిగుబడి, రూ. 1.30లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో రూ. 32వేలు ఖర్చులుపోను రైతుకు నాలుగు నెలల వ్యవధిలోనే రూ. 98వేల లాభం వచ్చిందన్నారు. ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధిక లాభాలు వచ్చే ఆయిల్పామ్ పంటపై రైతులు దృష్టిసారించాలన్నారు. అనంతరం రైతు సపావట్ సుందర్ను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, రైతుబంధ సమితి కన్వీనర్లు పులుగు సాగర్రెడ్డి, కందకట్ల నరహరి, మండల వ్యవసాయాధికారి సీహెచ్ యాకయ్య, హార్టికల్చర్ అధికారి తిరుపతి, ఎన్ఎస్ఎఫ్ కన్సల్టెంట్ సారంగం, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, ఏఈవోలు సమత, సంధ్య, రాజేందర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : రైతులు వరి సాగు విస్తీర్ణం తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, మినుము, పెసర సాగుచేయాలని ఏడీఏ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో సర్పంచ్ కుండె మల్లయ్య అధ్యక్షతన ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమావేశం నిర్వహించారు. జల్లి, అమీనాబాద్, ఉప్పరపల్లి గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటలపై సర్పంచ్లు, క్లస్టర్ ఏఈవోల సమక్షంలో రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ బుర్రి తిరుపతి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, ఏవో కర్పూరపు అనిల్కుమార్, ఏఈవోలు స్మిత, రఘు, సంపత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ : మండలంలోని నెక్కొండ, తోపనపల్లి, అలంకానిపేట, రెడ్లవాడ, నాగారం, పెద్దకోర్పోలు, దీక్షకుంట గ్రామాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆరు తడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ, మినుము, పెసర పంటలను పండించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, సర్పంచ్ ఆలకుంట సురేందర్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్లు అనుముల ధర్మారెడ్డి, గ్రామ కో ఆర్డినేటర్ వీరస్వామి, ఏఈవోలు వినేకర్, రాజీవ్లోచన్, నాగరాజు, రంజిత్, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, రైతుబంధు సమితి బాధ్యుడు గరికపాటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఖానాపురం, బుధరావుపేట, ధర్మరావుపేట, అశోక్నగర్ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. బుధరావుపేటలో ఆయన మాట్లాడుతూ.. జనుము, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పొద్దు తిరుగుడు, ఆవాలు, కంది, పెసర, మినుము, శనగ, మక్కజొన్న, జొన్న, సజ్జ తదితర పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, సర్పంచ్లు కాస ప్రవీణ్కుమార్, గొర్రె కవిత, వెన్ను శృతి, ఏఈఓలు సంతోష్, సంధ్య, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ : యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని ఏవో హరిప్రసాద్బాబు సూచించారు. మండలంలోని ఎలుకుర్తి, గీసుగొండ, మొగిలిచర్లలోని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మక్కజొన్న, శనగ, వేరు శనగ, పంటలను సాగు చేసుకోవాలన్నారు. వాటితో పాటు ఉద్యాన పంటలైన మిరుప, కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్ దౌడు బాబు, పూండ్రు జైపాల్రెడ్డి,15వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి : వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు కోరారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి ప్రతినిధులు మందాడి సుదర్శన్రెడ్డి, పాలెపు శ్రీనివాస్రావు, మండల వ్యవసాయ విస్తరణాధికారులు కడుదూరి రాజేశ్కుమార్, వేమిరెడ్డి హిమబిందు, ఉడుత సాయి ప్రసాద్, రాజారపు శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలతో అధిక లాభాలు..
నల్లబెల్లి : ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ముచ్చింపుల, కన్నారావుపేట, రాంపూర్, నల్లబెల్లి, నారక్కపేట గ్రామాల్లో శుక్రవారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు మక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ గోనెల పద్మ, ఏవో పరమేశ్వర్, సర్పంచ్లు బొట్ల సువర్ణ, తంగెళ్ల నిర్మల, రాజారాం, చింతపట్ల సురేశ్, మల్లికాంబ, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ పులి సంతోష్, ఏఈవోలు సాధన, భాస్కర్, శ్రీకాంత్రెడ్డి, మహేందర్, అనూష పాల్గొన్నారు.