దేవరుప్పుల, డిసెంబర్ 3 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాశోజు శ్రీకాంతాచారి పోరాటం అజరామరం అని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. శ్రీకాంతాచారి 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్వస్థలమైన దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో శనివారం నివాళులర్పించారు. శ్రీకాంతాచారి విగ్రహం వద్ద గులాబీ శ్రేణులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తీగల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, చింత రవి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నాడు చేపట్టిన పోరాటాన్ని శ్రీకాంతాచారి స్ఫూర్తిగా తీసుకున్నారని తెలిపారు. సమైక్యవాదుల కుట్రలకు భయపడి రాష్ట్రం రాదేమోనన్న నిరాశతో ఆత్మార్పణం చేసుకున్నారని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు, టీఆర్ఎస్ పోరాటంతో తెలంగాణ సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈదునూరి నర్సింహారెడ్డి, కొత్త జలేందర్రెడ్డి, మలిపెద్ది శ్రీనివాస్రెడ్డి, చింత రవి, కుతాటి నర్సింహులు, ఖాసీం, ఆకవరం నర్సింహారెడ్డి, జక్కి నర్సయ్య, ధరారత్ కిషన్, తీగల పరశురాములు, జోగు ఐలయ్య, జోగు సోమనర్సయ్య, నవీన్నాయక్, కృష్ణమూర్తి, అమర్సింగ్, సోమ్లానాయక్, చంద్రమౌళి,జోగు వీరస్వామి కారుపోతుల భిక్షపతి, రాంసింగ్, ఆకుల మల్లయ్య, సంజీవరెడ్డి, కారుపోతుల యాదగరి, హనుమంతు, మహేశ్, బుక్క రామయ్య,, గుండె రమేవ్ మడికొండ ఎల్లయ్య, చిరంజీవి,లొడంగి వెంకన్న, చింత యాదగిరి, రత్నాకర్రెడ్డి పాల్గొన్నారు.