హనుమకొండ, ఆగస్టు 31: సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పండుగ వాతావరణంలో గులాబీ జెండా ఎగుర వేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. మంగళవారం కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన హన్మకొండ ఆర్ఈసీ సమీపంలోని తారా గార్డెన్లో నిర్వహిం చిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్య కర్తల విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు, పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే నాయకత్వం పటిష్టంగా ఉంటుందని అన్నారు. గులాబీ జెండా మోసిన ప్రతి ఒక్కరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంద ని పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో డీలిమి టేషన్, రిజ ర్వేషన్లతో కొందరికి అవకాశం దక్కలే దని, ఇలాంటి వారికి రానున్న రోజ్లుల్లో న్యాయం జరుగుతుందన్నారు. కొత్త కార్పొరేటర్లు అందరి నీ కలుపుకొని ముందుకు సాగాలని, అసంతృప్తు లను బుజ్జగించే బాధ్యత కూడా మీదే నని చీఫ్ విప్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా మారనుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణం కోసం కమిటీలు వేస్తున్నామని, ఇందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయ న తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సి న బాధ్యత గులాబీ సైనికులపై ఉందన్నారు.
ప్ర జల సమస్యల కోసం కాకుండా పదవులు, ఉనికి కోసం ప్రతిపక్షాలు సభలు, పాదయాత్రలు అంటు న్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం లో ఉన్న బీజేపీ ఓ ఝూటా పార్టీ అన్నారు. తెలంగాణ విభజన చట్టంలోని అంశాలను ఎందుకు అమ లు చేయడం లేదో బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. దమ్ముంటే బీజేపీ వరంగల్ జిల్లా ప్రజల చిర కాల వాంఛ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, డివి జన్ ఏర్పాటుతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయించాల ని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడు తొత్తుగా వ్యవహరి స్తున్నాడని ఆరోపించారు. ఈ ఏడేళ్ల పాలన లో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సంక్షే మం కోసం సీఏం కేసీఆర్, కేటీఆర్లు అనేక పథ కాలు అమలు చేస్తున్నారన్నారు. బూత్ కమిటీ సభ్యు లను పార్టీపరంగా ఆదుకుంటామని, మహిళా సంఘాలకు చేయూతను అందిస్తామన్నారు.
పార్టీ పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి
పార్టీ పటిష్టంగా ఉంటేనే అభివృద్ది సాధ్యమని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సు ధారాణి అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన జెండా పండగను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి గు లాబీ కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. కార్య క్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుందర్రాజ్ యాదవ్, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.