నర్సంపేట రూరల్, మార్చి 4 : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డివిజన్ స్థాయి మహిళా క్రీడోత్సవాలను శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. గెలుపోటములూ సహజమని చెప్పారు. అనంతరం కబడ్డీ విజేత దుగ్గొండి టీం, ఖోఖో విజేత నెక్కొండ టీం, తాడులాగుట పోటీలో విజేతగా నిలిచిన చెన్నారావుపేట టీమ్కు బహుమతులు అందజేశారు. క్రీడల విజయవంతానికి కృషి చేసిన ఏపీఎంలు, పీఈటీలు, నిర్వాహకులు, మహిళా సమాఖ్య బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, బీఆర్ఎస్ నర్సంపేట పట్టణ, మండలాధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ పాల్గొన్నారు.