నెక్కొండ, సెప్టెంబర్ 5 : మండలంలోని పత్తిపాక, నెక్కొండ, మడిపల్లి ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీలు సోమవరం యుగంధర్, ఎర్ర అరుణ, వాసం వినీతాదేవి, అప్పల్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ పండిట్ పఠాన్ యాకూబ్పాషా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఎంఈవో రత్నమాల, పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రతాప్సింగ్, కర్ర యాకూబ్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాన ఉమామహేశ్వర్, పలిత శ్రీహరి, రాష్ట్ర బాధ్యులు శ్రీధర్రెడ్డి, రాపాల యాకయ్య తదితరులు సన్మానించారు.
కరీమాబాద్ : గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శంభునిపేట విశ్వనాథకాలనీ అధ్యక్షుడు కర్నె రవీందర్ తన గురువు రాజమౌళిని సత్కరించారు. 32వ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో వాసవి క్లబ్ స్మార్ట్ వరంగల్ కమిటీ సభ్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ఆవిష్కరించి కార్పొరేటర్ పల్లం పద్మ-రవి దంపతులను సత్కరించారు. ఉర్సులోని వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో కార్పొరేటర్ మరుపల్ల రవి, పాలకవర్గ సభ్యుడు యేర కోటేశ్వర్ ఉపాధ్యా యులను సత్కరించారు. తెలంగాణ అవయవదాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డు అధ్యాపకుడు మల్లారెడ్డిని రామలింగేశ్వర దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ అప్పరాజు రాజు సత్కరించారు. దయానందకాలనీ కమిటీ అధ్యక్షుడు మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో 8 మంది ఉపాధ్యాయులను సత్కరించారు.
ఖిలావరంగల్ : ఖిలావరంగల్ పడమర కోటలోని ప్రభుత్వ ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు జారతి సత్యనాథ్, మనోహర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : మండలంలోని పోశంపల్లి ఎంపీపీఎస్ ఉపాధ్యాయురాలు కొలిపాక సంగీత, రుద్రగూడెం ఎంపీపీఎస్ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, కన్నారావుపేట యుపీఎస్ ఉపాధ్యాయుడు అచ్చయ్య, మేడపల్లి జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు శివకుమార్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆదివారం అవార్డులు అందుకున్నారు. ఈసందర్భంగా మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈవో చదువుల సత్యనారాయణ, మండల నోడల్ అధికారి రామస్వామి వీరిని సన్మానించారు.
మట్టెవాడ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వరంగల్లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామన్నపేటలో ఉపాధ్యాయులను సన్మానించారు. ఎల్బీ కళాశాల రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ వంగరి సూర్యనారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోన్రెడ్డి మల్లారెడ్డికి డాక్టర్ రాజేంద్రప్రసాద్ శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, మాధవి, శ్రీకాంత్, సన్నీ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వరంగల్ డాక్టర్స్కాలనీ-2లోని కమ్యూనిటీ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత వరంగల్కు చెందిన 20 మంది ప్రైవేట్ టీచర్స్ ఆర్గనైజేషన్ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, సంస్థ బాధ్యులు సాయికుమార్, శ్రవణ్, దేవేందర్, వలి హుస్సేన్, శ్రీధర్ పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలంలోని బూరుగుమల్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దామెర రాజశేఖర్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఈసందర్భంగా ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.