కరీమాబాద్, సెప్టెంబర్ 23: కార్మిక కుటుంబాల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. బీడీ పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్న వారి పిల్లల చదువుల కోసం కేంద్రం ఏటా ఉపకార వేతనాలను అందిస్తున్నది. దీనిపై సరైన అవగాహన లేక చాలా మంది దరఖాస్తు చేసుకోవడం లేదు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 2021, నవంబర్ 15 దాకా గడువుంది. పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 2021 నవంబర్ 30 వరకు గడువు ఉంది. ఈ లోగా అర్హులు http//scholarship.gov.in (www.scholarship.gov.in) లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు మెయిల్ఐడీ helpdesk@nsp.gov.in, 0120-6619540లో సంప్రదింవచ్చు.
గడువు తేదీలు.. అర్హతలు..
వినియోగించుకోవాలి
కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ను అర్హులు వినియోగించుకోవాలి. తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే 040-24658026 హైదరాబాద్ కార్యాలయంలో గాని , కరీమాబాద్లోని బొమ్మలగుడి వద్ద ఉన్న బీడీ కార్మికుల దవాఖానలో గాని సంప్రదించవచ్చు.
-డాక్టర్ సురేశ్ కుమార్, వైద్యాధికారి, కార్మికశాఖ దవాఖాన, కరీమాబాద్