నర్సంపేట, నల్లబెల్లి, అక్టోబర్ 26 : ఉమ్మడి పాలనలో ఏటికి ఎదురీదినట్లు రైతులు ఎవుసంలో పడుతున్న గోసను గుర్తించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి అన్నదాతల కష్టాలను తీర్చేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నారు. దుక్కిదున్నేకాన్నుంచి దిగుబడులను అమ్ముకునేదాకా అన్నదాతలకు ఏమేంగావాల్నో అవన్నీ సమకూరుస్తున్నారు. వ్యవసాయం, రైతుల అభ్యున్నతే లక్ష్యం గా ముందుకుపోతున్నారు. ఉద్యమకాలంలో న ర్సంపేట ప్రాంతానికి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి గోదావరి జలాలను రప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలోని నల్లబెల్లి మండ లం రంగాయ చెరువు ప్రాజెక్టును రూ.305 కోట్ల తో నిర్మించింది. పాకాల ప్రాజెక్టును రూ.360 కో ట్లతో నిర్మించి నర్సంపేట ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చింది. ఎండాకాలంలోనూ పంటలు జోరుగా సాగువుతున్నాయి. ఏటా రెండు పంటలకు సమృద్ధిగా నీరందుతున్నది. రైతులకు సాగునీటి కష్టాలు తొలగిపోయాయి. ఎస్సారెస్పీ డీ బీఎం 38 ఎడమ కాలువ నల్లబెల్లి మండలంలో ప్రతి గ్రామానికీ ఉంది. లెంకాలపెల్లికి ఎస్సారెస్పీ కాలువతో నీరందుతున్నది.
కుడి వైపున ఉన్న రై తులకు గోదావరి జలాలు అందుతున్నాయి. ఎం డాకాలంలోనూ చెరువులు గోదావరి జలాలతో అ లుగులు దుంకుతున్నాయి. వరి, మిర్చి, పత్తి, మ క్క, పసుపు, పల్లి ఇలా తీరొక్క పంటలు పండుతున్నాయి. పంటలను విక్రయించుకునేందుకు వ రంగల్, నర్సంపేట మార్కెట్లు అందుబాటులో ఉ న్నాయి. పంట నిల్వ చేసుకునేందుకు ప్రతి మండలానికి పది వేల మెట్రిక్టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉన్నాయి. రైతుబంధు వచ్చాక పెట్టుబడి కష్టాలు దాదాపుగా తొలగిపోయాయి. నకిలీ, కల్తీ విత్తనాల బాధ లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. కల్తీ, నకిలీలను విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్టు లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఒకవేళ రై తులు ఏదైనా కారణంతో చనిపోయినా కుటుం బం వీధిన పడకుండా ఉండేందుకు రైతుబీమా కూడా అందిస్తున్నది. వ్యవసాయంలో పూర్వ పద్ధతులకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటున్నది. రైతులు కొత్తకొత్త విధానాలను అనుసరించేలా చూస్తున్నది. యంత్రాల వినియోగం కోసం భారీగా రాయితీలు, సబ్సిడీలు అందిస్తూ మరింత ఊతమిస్తున్నది. ఇలా వ్యవసాయంలో రైతులకు ఎలాంటి కష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటున్నది. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలు వందశాతం తగ్గిపోయాయి.
అధికారుల విచారణ.. ప్రభుత్వానికి నివేదిక
సాయిలు ఆత్మహత్యపై త్రిసభ్య కమిటీ విచార ణ జరిపింది. తహసీల్దార్, ఎస్ఐ, ఏవో గత సెప్టెంబర్ 20న లెంకాలపల్లికి వచ్చి ప్రజల సమక్షంలో సాయిలు ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నా రు. సాయిలు కుటుంబ సభ్యులతోనూ మాట్లాడా రు. వైద్యం కోసం చేసిన అప్పులకు అనారోగ్యం తోడు కావడంతో మనస్తాపానికి లోనై సాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ అధికారులు ధ్రువీకరించారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు.
వ్యవసాయంలో నష్టాలు రాలె..
వైద్యం కోసమే అప్పయింది..
కలప బేరంతో అప్పుల పాలు..
ఇతర కారణాలతో అప్పులై ఆత్మహత్య.. వ్యవసాయంలో నష్టం వల్ల అని ప్రచారం..
నల్లబెల్లి మండలం లెంకాలపల్లికి చెందిన కీసరి సాయిలు కర్ర బేరం చేసేవాడు. వివిధ ప్రాంతాల్లో బిజినెస్ చేశాడు. ఈ క్రమంలో సాయిలు ఒకటి రెండు కా దు వరుసగా మూడుసార్లు ప్రమాదాల బారినపడి ఆర్థికంగా చితికిపోయాడు. 2016లో ఆటో బోల్తా పడి, అదే సంవత్సరం ఓ వాహనం ఢీకొని, 2019లో ట్రాక్ట ర్ బోల్తా పడి గాయాలపాలయ్యాడు. కాళ్లు, చేతులు విరగడంతో వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల దాకా అప్పయింది. తీర్చే అవకాశం లేకపోవడం, వడ్డీ తడిసి మోపెడవడంతో మనస్తాపంతో పురుగుల మందు తా గాడు. ఎంజీఎంలో గత సెప్టెంబర్ 12న రాత్రి చనిపోయాడు. అయితే స్థానికులు కొందరు సాయిలుది రైతు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. వ్యవసాయంలో నష్టాలు రావడం వల్ల అతడు ఆత్మహ త్య చేసుకున్నట్లుగా నల్లబెల్లి పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు కూడా చేశారు. కలప వ్యాపారంలో భాగంగా సాయిలు రోడ్డు ప్రమాదాలకు గురై వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటే కొన్ని పత్రికలు వక్రీకరించి వ్యవసాయంలో నష్టాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచురించాయి. సాయిలుకు లెంకాలపల్లిలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా అతడి కొడుకులు ప్రస్తుతం పత్తి సాగు చేస్తున్నారు.