గిర్మాజీపేట, ఫిబ్రవరి 12 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్ఎంపీ, పీఎంపీలకు సహకారం అందించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజలకు విస్తృత వైద్యసేవలు అందించారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఫార్మా శిక్షణను కొద్ది మంది వినియోగించుకొని సర్టిఫికెట్ పొందారన్నారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారని, వారికీ శిక్షణ ఇవ్వాలన్నారు. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కోరారు. వీవోల మాదిరిగానే ఆర్పీలకూ గౌరవ వేతనం పెంచాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే విన్నవించారు.