గీసుగొండ, ఆగస్టు 3 : అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కోనాయిమాకుల గ్రామంలో మంగళవారం విలేజ్ పార్కు, రైతువేదిక, డంపింగ్యార్డు, వైకుంఠధామాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే పరకాల నియోజకవర్గానికి అత్యధిక నిధులను తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. రైతుల కోసం వేదికలను నిర్మించినట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరంటు అందిస్తున్నామన్నారు. టెక్స్టైల్ పార్కుతో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే రెండు కంపెనీలు పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. రేషన్కార్డులు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, ఎంపీపీ భీమగాని సౌజన్య, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, తహసీల్దార్ సుహాసిని, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రవీణ్కుమార్, సర్పంచ్లు డోలి రాధాబాయి, దౌడు బాబు, గోనె మల్లారెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, నమిండ్ల రమ, రాబోయిన రజిత, నాగేశ్వర్రావు, అనిల్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కుడా డైరెక్టర్ వీరగోని రాజ్కుమార్, గీసుగొండ పీఎసీఎస్ చైర్మన్ రడం శ్రీధర్, ఏడీఏ రవీందర్, పీవో మోహన్రావు, ఊకల్ సొసైటీ చైర్మన్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.