ఖిలావరంగల్, మే 11: రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో పలు చోట్ల స్థానిక నాయకులు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. గ్రేటర్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్నగర్లో ముస్లిం కుటుంబాలకు కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, సురేశ్ దుస్తులు పంపిణీ చేశారు. ముస్లింల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నరేందర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గిరిప్రసాద్నగర్ కాలనీ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, నాయకులు జబ్బార్, సలీం, శ్రీకాంత్ పాల్గొన్నారు. కాగా, ఖిలావరంగల్ మండలంలోని ముస్లిం కుటుంబాలకు రెండు వేల జతల దుస్తులను కేటాయించినట్లు తహసీల్దార్ డీ మంజుల తెలిపారు. ఈ మేరకు మత పెద్దలకు దుస్తుల బ్యాగ్లను అందజేశారు.
23వ డివిజన్లో..
మట్టెవాడ : నగరంలోని 23వ డివిజన్ తుమ్మలకుంట ఆటోనగర్ మసీదు వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలగం లీలావతి, టీఆర్ఎస్ నాయకులు యెలగం సత్యనారాయణ, బొల్లు సతీశ్, వేల్పుల ప్రసన్నయాదవ్, కొత్తపల్లి వినయ్, ఎండీ సర్వర్, ఎండీ అన్వర్, దేవర రాము, ఎండీ యాకూబ్, రాళ్లబండి రాకేశ్, బయ్య సాంబయ్య, విజయ్, మసీదు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అలాగే, ములుగురోడ్డు, రంగంపేటలోని మసీదుల కూడా దుస్తులు పంపిణీ చేశారు.
39, 41వ డివిజన్లలో..
కరీమాబాద్ : గ్రేటర్ 39వ డివిజన్లో ముస్లింలకు కార్పొరేటర్ సిద్దం రాజు దుస్తులు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. అఫ్జల్, హసన్ అలీబేగ్ పాల్గొన్నారు. అలాగే, 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో కూడా దుస్తులు పంపిణీ చేశారు. పోశాల స్వామి పాల్గొన్నారు.
దర్గాకాజీపేటలో..
కాజీపేట : రంజాన్ పండుగ సందర్భంగా 48వ డివిజన్ దర్గాకాజీపేటలో పేద ముస్లింలకు టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు దుస్తులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ముస్లిం మైనార్టీ జిల్లా నాయకుడు, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. అఫ్జల్నగర్లో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అయూబ్, ఫజీల్, రహీం, ఇమ్రాన్, సాధిక్, జకీర్, చోటు, గుల్లు, అజీముద్దీన్, రియాజ్, బాబా పాల్గొన్నారు.
గట్లనర్సింగాపూర్లో..
భీమదేవరపల్లి : రంజాన్ సందర్భంగా మండలంలోని గట్లనర్సింగాపూర్లో 300 మంది ముస్లింలకు ఎంపీపీ జక్కుల అనితారమేశ్ దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబెల్లి చంద్రకళ, మండల కోఆప్షన్ మెంబర్ సయ్యద్ ఖాజా షరీఫొద్దీన్, ఉపసర్పంచ్ సయ్యద్ బిక్ పాషా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ చాంద్పాషా, సాదిక్పాషా, మహ్మద్ షరీఫ్, మౌలానా పాల్గొన్నారు.