జిల్లా టాస్క్ఫోర్స్ టీం సభ్యులు
కృష్ణకాలనీ, ఏప్రిల్ 1 : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో అక్రమంగా వెంచర్లు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా టాస్క్ఫోర్స్ టీం సభ్యులు హెచ్చరించారు. గురువారం మున్సిపల్ పరిధి కొంపెల్లి శివారు సర్వే నంబర్ 146లో సన్ వ్యాలీ పాఠశాల పక్కన సుమారు 2 ఎకరాలు, సర్వే నంబర్ 175లో ఎంఎస్ఆర్ పత్తిమిల్లు సమీపంలో సుమారు 2 ఎకరాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలోని హద్దు రాళ్లను జిల్లా టాస్క్ఫోర్స్ టీం ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మా ట్లాడుతూ ఇక నుంచి ఎవరైనా అక్రమంగా వెంచర్లు వేసినట్లయితే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు అక్రమ లేఔట్లలో ప్లాట్లుకొని మోసపోవద్దన్నారు. అనుమతులు ఉన్నాయా? లేదా అని మున్సిపల్ కార్యాలయంలో తెలుసుకుని ప్లాట్లు కొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దేవేందర్, ఎస్సై అభినవ్, ఫైర్ అధికారి రాజ్కుమార్, మున్సిపల్ టీపీవో అవినాశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
డీఎంకే నేత రాజాపై 48 గంటల పాటు ప్రచార నిషేధం..
భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీకి రజనీకాంత్ థ్యాంక్స్