కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకూ నీరందిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్
ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి
గీసుగొండ, ఏప్రిల్ 24 : ‘మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని’ రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంట, 16వ డివిజన్ ధర్మారం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీష గెలుపునకు గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరంట్ ఇస్తోందని, ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం జరుగుతోందన్నారు. అభివృద్ధి చేస్తున్న పార్టీల అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. 15,16 డివిజన్లను ‘అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాదే’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, 15 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆకులపల్లి మనోహర్, 16 డివిజన్ అభ్యర్థి సుంకరి మనీష, గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కుడా డైరెక్టర్ వీరగోని రాజుకుమార్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, రైతుబంధు మండల కన్వీనర్ రాజు, టీఆర్ఎస్ నాయకులు నవీన్రాజు, రాజయ్య, బాలయ్య, లవ్రాజు, బాబు, కిరణ్కుమార్, నర్సయ్య, పీ రాజు, శ్రావణ్, ఉజ్వల్, రఘు, చిన్నవెంకటేశ్వర్లు, సర్పంచులు నాగేశ్వర్రావు, మల్లయ్య, ప్రకాశ్, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.