చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
అంబేద్కర్ భవన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
నయీంనగర్, మే 24 : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్లోని అంబేద్కర్ భవన్లో హన్మకొండ తహసీల్దార్ రాజ్కుమార్ అధ్యక్షతన పశ్చిమలోని 70మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిచడమే కా కుండా కరోనా వార్డులో స్వయంగా సీఎం కేసీఆ ర్ తిరుగుతూ ధైర్యం చెప్పారని అన్నారు. మేయ ర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మన ఇంటి పెద్ద దిక్కు అని, కరోనా కష్ట సమయంలో ఎవరూ ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకుంటన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, కుడా అడ్వయిజర్ సభ్యుడు శివశంకర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.