పరకాల, ఏప్రిల్ 23: కరోనా వైరస్ కట్టడికి జిల్లావ్యాప్తంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వీధులు, వార్డుల్లో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఇందులో శుక్రవారం పరకాల 13వ వార్డులో కౌన్సిలర్ శనిగరపు రజిని హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అందరూ మాస్కులు ధరించాలని, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వర్ధన్నపేట: మండలంలోని అన్ని గ్రామాలతో పాటు వర్ధన్నపేట పట్టణంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మున్సిపల్ సిబ్బందితో వార్డు కౌన్సిలర్లు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
నర్సంపేట రూరల్: మండలంలోని పర్శనాయక్తండా, ముగ్ధుంపురం, ఆకులతండా, ఇటుకాలపల్లి, ముత్తోజిపేలో పంచాయతీల ఆధ్వర్యంలో సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. సర్పంచ్లు బానోత్ గాంధీ, పెండ్యాల జ్యోతి, బానోత్ రాము, మండల రవీందర్, గోలి శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు.
చెన్నారావుపేట: మండలకేంద్రంలో కార్యదర్శి బాలకిషన్గౌడ్తో కలిసి సర్పంచ్ కుండె మల్లయ్య ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అత్యవసరమైతేనే మాస్క్ ధరించి బయటకు రావాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో జీపీ సిబ్బంది బూర రమేశ్, కుసుమ సురేందర్, మంగ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలంలోని ఏబీతండా పంచాయతీ పరిధిలో సర్పంచ్ మాలోత్ ప్రమీల, చింతనెక్కొండలో సర్పంచ్ గటిక సుష్మ ఆధ్వర్యంలో వీధుల్లో రసాయనాలను పిచికారీ చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్యామల, వార్డు సభ్యులు మాలోత్ విజయ, నాగేశ్వర్రావు, కో ఆప్షన్ సభ్యులు భాస్కర్రావు, మాలోత్ రవి, గోపీనాయక్, వెంకట్రాంరెడ్డి, జీపీ సిబ్బంది రాము, తిరుపతి పాల్గొన్నారు.
శాయంపేట: మండలంలోని పత్తిపాకలో వైద్య సిబ్బంది హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. శాయంపేటలోని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, బస్టాండ్ సెంటర్, రోడ్లపై గ్రామ పంచాయతీ సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు.
రాయపర్తి: గ్రామాల్లో సర్పంచ్లు రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు. మండలకేంద్రంలోని 14 వార్డుల్లోని వీధులతోపాటు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి, ఆర్టీసీ బస్టాండ్, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హైపోక్లోరైట్ ద్రావనాన్ని సర్పంచ్ గారె నర్సయ్య జీపీ సిబ్బందితో పిచికారీ చేయించారు. కొత్తూరులో సర్పంచ్ కందికట్ల స్వామి నేతృత్వంలో రసాయనాలు పిచికారీ చేశారు.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్: సిబ్బందికి జర్మన్ ఎంబసీ కీలక సూచనలు
మా ఆక్సిజన్ మాకే : సీఎం మమతా బెనర్జీ