ఇంఫాల్: మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గలేదు. తమ వర్గానికి చెందిన పురుషులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్లో (Manipur) ఈ సంఘటన జరిగింది. బిష్ణుపూర్ జిల్లాలో పోలీస్ యూనిఫాం ధరించిన 11 మంది సాయుధ వ్యక్తులను పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ సిబ్బంది గుర్తించారు. ఆ వ్యక్తులను నిర్బంధించి వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ విషయం తెలిసిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆర్మీ వాహనాలను చుట్టుముట్టారు. తమ వర్గానికి చెందిన సాయుధ వ్యక్తులు గ్రామ రక్షణ వాలంటీర్లని తెలిపారు. వారిని నిరాయుధులను చేస్తే తమ గ్రామంపై ఇతర వర్గం వారు దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ వారిని విడుదల చేయాలని, స్వాధీనం చేసుకున్న ఆయుధాలను అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే మహిళలను చెదరగొట్టేందుకు సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో గందరగోళం నెలకొన్నది.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిరసనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు నిర్బంధించిన వ్యక్తులను విడిచిపెట్టారు. అయితే స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో ఆర్మీ సిబ్బంది, పోలీసులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. అనంతరం మహిళలు అక్కడి రహదారిని దిగ్బంధించారు.
Meira Paibis (civilian women group) in Manipur’s Bishnupur block army personnel from seizing arms found in possession of radical group Arambai Tenggol. Army fires in the air to disperse the mob. pic.twitter.com/ejNVSU2K1M
— Vijaita Singh (@vijaita) April 30, 2024