అమరావతి : ఏపీలో వైసీపీ(YCP) హయాంలో విప్లవాత్మక పాలన కొనసాగించామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, నాడు నేడు విద్యా కానుక, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం, పిల్లల చేతిలో ట్యాబ్లు, తరగతి గదిలో డిజిటల్ బోధన, ఫీజు రియింబర్స్మెంట్, 93 శాతం విద్యా దివేన(VIdya Deevena), విద్యావసతి కింద సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 25 లక్షలు పెంచామని తెలిపారు.
అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందించామని తెలిపారు. రైతన్నకు పెట్టుబడి సాయం, రైతు బరోసా కేంద్రాల ద్వారా చేయూతను అందిస్తున్నామని చెప్పారు. ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కడం ద్వారా నగదును పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ. 2.70 లక్షల కోట్లను అందించామని వివరించారు.
చంద్రబాబు(Chandra Babu) కు ఓటేస్తే మళ్లీ మోసపోతామని పేర్కొన్నారు. ప్రజల తరుఫున ఒక్కరినే యుద్ధం చేస్తున్నానని తెలిపారు. ల్యాండ్ అండ్ టైటిల్యాక్ట్(Land and Title) పై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.