న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, బ్రిటన్, హాంకాంగ్, పాకిస్థాన్ దేశాలు భారత్ నుంచి తమ దేశాల్లోకి విమాన ప్రయాణాలపై నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు భారత్లోని తమ పౌరులకు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నాయి.
తాజాగా జర్మనీ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ మేరకు భారత్లోని జర్మనీ రాయబార కార్యాలయం తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది. సిబ్బంది పూర్తిగా హోమ్ ఆఫీస్ నుంచే పనిచేయాలని ఆదేశించింది. అవసరమైన సిబ్బంది ముందస్తు సెలవులకు వెళ్లే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరింది. ఎంబసీలో ప్రాథమిక విధులు నిర్వహించడానికి అవసరమైన సిబ్బంది కొద్దిమంది ఉంటే చాలని పేర్కొన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
మానవత్వం చాటుకుంటున్న ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు