హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల పర్వం కొనసాగుతూనే ఉంది. అసలే వర్గపోరుతో కొట్లాడుకునే కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరో తలనొప్పిగా మారాయి. ఇతర పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్లో చేరుతుం డటంతో ఆ పార్టీ క్యాడర్లో అసృంతృప్తికి కారణమవుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా(Warangal) కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల(Congress activists) సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది.
వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య(Kadiyam Kavya) ముందే కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు(Attacked). కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మొదలైన గొడవ.. చిలికి చిలికి గాలివానలా మొదలయింది. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలు, పాత కార్యకర్తలుగా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కొట్టుకున్నారు. గొడవ ఎంతకు సద్దుమణగకపోవడంతో కడియం కావ్య మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.
కడియం కావ్య ముందే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రసాభాస.. కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మొదలైన గొడవ.
కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలు, పాత కార్యకర్తలుగా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న… pic.twitter.com/Uk6wWHC7ne
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024