ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలి
కేయూ వీసీప్రొఫెసర్ టీ రమేశ్
బాధ్యతలు స్వీకరించిన ఉప కులపతి
భీమారం, మే 23 : కాకతీయ యూనివర్సిటీ 14వ వైస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం కేయూ పరిపాలన భవనంలో పాలకమండలి సభ్యులు, ఉద్యోగులు సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తానన్నారు. ఉద్యోగులు సమష్టిగా పనిచేస్తూ యూనివర్సిటీ ప్రతిష్ఠను పెంచాలన్నారు. ప్రత్యేకంగా బోధన, పరిశోధనలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుం డా ఆన్లైన్పై అధ్యాపకులు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యూజీసీ సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చెస్తానని చెప్పారు. ముందుగా వీసీ ప్రొఫెసర్ రమేశ్కు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం పుష్పగుచ్ఛ అందజేసి స్వాగతం పలికారు. పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ ఎం.రాజేశ్వర్, ప్రొఫెసర్ టీ మనోహర్, ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ మదన్కుమార్, రాజిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి సన్మానించా రు.
కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.మహేందర్రెడ్డి, యూనివర్సిటీ అభివృద్ధి అధికారి ప్రొఫెసర్ రామచం ద్రం, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొ. వీరన్న, కేయూ ప్రొఫెసర్ల సురేశ్లాల్, విజయబాబు, బన్న అయిలయ్య, వెంకట్రామరెడ్డి, మల్లికార్జునరెడ్డి, హనుమంత్, శాస్త్రి, శ్రీలత, శ్రీనివాస్, నరసింహాచారి, సుదర్శన్, కృష్ణమాచారి, భా స్కర్, సంఘాల బాధ్యులు ప్రణ్య్కుమార్, అశోక్బాబు, హబీబుద్దీన్, శ్రీధర్, ఎల్. రాము, ప్రభాకర్, నరసింహారావు, నేతాజీ, జవేర్, పుల్లా శ్రీనివాస్, రాము, బాబు, ఎల్లయ్య, తిరుపతి తదితరులు రమేశ్కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.