వర్ధన్నపేట, మే 10 : రైతులను ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కొనుగో లు కేంద్రాల నిర్వహణ నోడల్ అధికారి రేఖ అన్నారు. మండలంలోని కుమ్మరిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిం చి చేయూతనిస్తున్నదన్నారు. నిర్వాహకులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. కొ నుగోలు చేసిన ధాన్యానికి నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ కార్యదర్శి వెంకన్న, రైతులు పాల్గొన్నారు.
మండలంలోని రామవరంలో ప్రభు త్వం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో రాంనర్సయ్య రైతులు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలిం చి నిబంధనల ప్రకారం కొనుగోలు చే యాలన్నారు. నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏవోలు, రైతులు, మహి ళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని ముస్త్యాలపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మచ్చ అనసూర్య, పీఎసీఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి ప్రారంభించారు. అనంతరం ముస్త్యాలపల్లి వాగు వద్ద నిర్మిస్తున్న మెట్లదారిని పరిశీలించారు. సర్పంచ్ బొట్ల సంధ్య, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భీమిడి నాగిరెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు బందెల విజయ, ఏపీవో రమాదేవి, ఏఈవో రాకేశ్ పాల్గొన్నారు.
మండలంలోని రాయపర్తి, పులిగిల్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మహేందర్ తనిఖీ చేశారు. అనంతరం రాయపర్తి ఆ రోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రెండో డోసు కరోనా వ్యాక్సినేషన్ సజావుగా జరిగేలా చూడాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బం ది, డాక్టర్ ప్రదీప్ కుమార్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మోతె కళావతి, జ డ్పీటీసీ కోమాండ్ల జయ, మండల వ్యవసాయ శాఖాధికారి కృష్ణకుమార్ కోరారు. మండలంలోని నాగుర్లపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వా రు ప్రారంభించారు. కార్యక్రమంలో స ర్పంచ్ కందికొండ రజిత, ఏఈవో మెం డు అశోక్, మాజీ జడ్పీటీసీ అజ్మీరా పద్మ, నాయకులు మచ్చిక నర్సయ్యగౌడ్, రాజహంస, కోమాండ్ల గోపాల్రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, బొల్లోని సాంబయ్య, ఉప సర్పంచ్ తనుగుల రవీందర్, కడారి కు మారస్వామి, బండారు చిన్న వెంకటేశ్వ ర్లు, అల్లి రవి, కొమ్మ రవి, గొడిశాల అశో క్, మండల కుమారస్వామి, సోమర్థి రా జు, సాధుల అశోక్, బొల్లం కేదారి, తనుగుల సదయ్య, బండారు రమేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. పెద్దమ్మగడ్డలో పాకాల పురుషుల పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చూడి లింగారెడ్డి, బాధ్యులు మల్యాల పోశెట్టి, వల్లెపు శ్రీనివాస్, గులాంబాబా, బొప్పిడి పూర్ణచందర్రావు, వెంకన్న, రవి పాల్గొన్నారు.
నెక్కొండ : మండలంలోని దీక్షకుంటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్వింటాకు పది కిలోల మేర కోతలు పెడుతున్నారని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై కోతలు పెడుతున్నారని రైతులు రవి, మల్లయ్య, ఈర్య ఆందోళన వ్యక్తం చేశారు.
చెన్నారావుపేట : చెన్నారావుపేట సొసైటీ పరిధిలోని చెన్నారావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో 4360 బస్తాలు, పాపయ్యపేటలో 449 బస్తాలు, ఎల్లాయగూడెంలో 2059 బస్తాలు, అలాగే అమీనాబాద్ సొసైటీ పరిధిలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో 3500 బస్తాలు, అమీనాబాద్లో 2000 బస్తాలను కాంటా వేసినట్లు ఆయా సొసైటీల చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి తెలిపారు.
బోజేర్వు గ్రామంలో జై దుర్గా భవానీ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏవో అనిల్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షు డు భూక్యా రవీందర్, సర్పంచ్లు పిండి విజయ, ఎంపీటీసీ భూక్యా మౌనిక, ఏఈవో స్మిత, లక్ష్మి, వెంకన్న, వీరాసింగ్, సతీశ్, దేవ్సింగ్, బాలు, ప్రవీణ్, మోహ న్ నర్సు పాల్గొన్నారు.
గీసుగొండ : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. మండల కేంద్రంతో పాటు కొమ్మాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. గత పాలకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూడా డైరెక్టర్ వీరగోని రాజ్కుమార్, సర్పంచ్లు వీరాటి కవిత, బాబు, అంకతి నాగేశ్వర్రావు, గోనె మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, నాయకులు రవీందర్రెడ్డి, సునీల్, కుమారస్వామి, బాబురెడ్డి, నాగ య్య, లింగారెడ్డి, స్వామి పాల్గొన్నారు.