కరీమాబాద్ : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉర్సు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆల్బమ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు చేపట్టేలా అధికారులతో మాట్లాడతానన్నారు. అవసరమైతే ఉర్సు రంగలీల మైదానంలో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడుతానని తెలిపారు.
ఉత్సవాల విజయవంతానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పలు విషయాలను ఉత్సవ కమిటీ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో దసరా కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్బాబు, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి మండ వెంకన్నగౌడ్, ఉత్సవ కన్వీనర్ నరేందర్ ఉపాధ్యక్షుడు మేడిది మధుసూదన్, శివమూర్తి, కార్యదర్శులు గోనె రాంప్రసాద్, సమ్మయ్య, కార్యదర్శులు బజ్జూరి వాసు, బొల్లం రాజు పాల్గొన్నారు.