వర్ధన్నపేట : రూ. 3లక్షలలోపు ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు న్యాయసేవా సాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చని వరంగల్ జిల్లా రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి చాముండేశ్వరీ సూచించారు. మండలంలోని బండౌతాపురం గ్రామంలో రాష్ట్ర, జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం న్యాయసేవా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు న్యాయమూర్తి హాజరై మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఎక్కడైనా అన్యాయం జరిగినట్లయితే వారు కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. వీరు న్యాయవాధిని ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేకపోతే న్యాయసేవా సంస్థను ఆశ్రయిస్తే సంస్థ ద్వారా ప్రత్యేకంగా న్యాయవాధిని ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
అలాగే గ్రామాల్లో అనవసరమైన తగాదాలకు వెళ్లకుండా ప్రజలంతా శాంతిగా ఉండాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు రక్షణ కల్పించేందుకు పోలీసు వ్యవస్థ, న్యాయాన్ని అందించేందుకు న్యాయ వ్యవస్థ సిద్ధంగా ఉంటుందని చాముండేశ్వరీ వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ గొల్ల రమేశ్, సీఐ సదన్కుమార్, ఎస్ఐ రామారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.