వరంగల్ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ గంచిన భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనమిదో రోజుకు చేరుకున్నాయి. కన్నుల పండువగా జరుగుతున్న వేడుకలను పురస్కరించుకోని దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్సవాలలో భాగంగా రోజుకో అలంకరణలో భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం ఎనమిదో రోజు మహిషామర్దినీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని సాయంత్రం వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో శేషు భారతి కలెక్టర్ దంపతులకు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కలెక్టర్ దంపతులకు అమ్మవారి శేషవసా్త్రలు బకరించారు. ప్రసాదాలు అందచేశారు.