వర్ధన్నపేట : మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు పసునూరి శంకరయ్య(65) విద్యుత్షాక్తో గురువారం మృతి చెందాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం 4గంటల వరకు కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై బావి వద్దకు వెళ్లి చూశారు. వ్యవసాయ బావి వద్ద మోటర్ స్టార్టర్ వద్ద మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో గ్రామస్తులు బావి వద్దకు వెల్లి పరిశీలించి శంకరయ్య చేతిలో టెస్టర్ ఉండడంతో విద్యుత్ షాక్ గురై మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆదర్శ రైతుగా, మాజీ ఎంపీటీసీ సభ్యుడిగా శంకరయ్య అధికారులు, ప్రజలో మంచి పేరు తెచ్చుకున్నాడన్నారు. కాగా శంకరయ్య విద్యుత్షాక్కు గురై మృతి చెందిన విషయం తెలియడంతో మండల ప్రముఖులు, అధికారులు దిగ్బ్రాంతికి గురయ్యారు. శంకరయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.