వరంగల్ : ఈ నెల 11వ తేదీలోగా గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాటుపై హసన్ పర్తి మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 11తేదీలోగా గ్రామ, అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. కమిటీల ఏర్పాటుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి గ్రామానికి వెళ్లి స్థానిక నాయకుల సమన్వయంతో గ్రామ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునీత, జడ్పిటీసీ రేణుకుంట్ల సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, పీఏసీస్ చైర్మన్ రమేష్ గౌడ్, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ అంచూరి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.