వరంగల్ : జిల్లాలో కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలు ఒకేచోట ఉండేలా తీర్చిదిద్దేందుకు రంగసాయిపేటలోని ప్రభుత్వ కళాశాలను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థల పరిశీలన చేశారు. కళాశాల ఆవరణలో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలతో పాటు ఉన్నత పాఠశాల స్థలాన్ని పరిశీలించారు.
భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలపై చర్చించారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, ఆర్డీఓ మహేందర్ జీ, తహసిల్దార్ మంజులతోపాటు కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.