వరంగల్ : సౌత్ సెంట్రల్ రైల్వే మాజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటుకల బతుకమ్మలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొని ఆడిపాడారు. కాజిపేటలోని రైల్వే మహిళా కార్మికులకు మేయర్ బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు.
బతుకమ్మ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ప్రతి ఏటా ఆడపడుచులకు కానుకగా చీరలను అందజేస్తున్నారని, ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, పండుగలకు పెద్ద పీట వేయడం ముదావహం అన్నారు.
కార్యక్రమంలో కాల్వ శ్రీనివాస్, ఎస్.సి.రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షురాలు సరోజినీ రెడ్డి, జోనల్ మహిళా కోఆర్డినేటర్, ఏ. డి.ఎస్ స్వరూప, కాజీపేట మహిళ కోఆర్డినేటర్ రాధిక రత్నం, ప్రణీత, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, కాజీపేట కోఆర్డినేటర్, సదానందం, పాత వేద ప్రకాష్, నిర్మల, సమ్మయ్య, ఎస్. రవీందర్, మహిళా ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.