‘ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగులు అంటే ప్రేమ అందుకే ఏ రాష్ట్రంలోనూ లేనంత పీఆర్సీ ఇచ్చారు. ఆయన విధానాలకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయడం వల్లే దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది’ అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి ఆదివారం హనుమకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ను శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం టీజీవో ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సంఘం ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు ఉండొద్దనే ప్రభుత్వం కొత్త జోనల్ విధానం అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ లాంటి నేత సీఎంగా ఉండాలని చాలా రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని, జాతీయ స్థాయిలోనూ ఈ డిమాండ్ వినిపిస్తున్నదని చెప్పారు.
వరంగల్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగులంటే ప్రేమ అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి ఆదివారం హనుమకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ను శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం టీజీవోస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సంఘం ఆఫీసు బేరర్ల సమావేశంలో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని, ఇది అందరి బాధ్యత అని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయడంతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు ఉండొద్దని కొత్త జోనల్ విధానం అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ లాంటి నేత సీఎంగా ఉండాలని చాలా రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని, జాతీయ స్థాయిలోనూ ఈ డిమాండ్ ఉన్నదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, నిరంతర కరెంటు, సాగునీటి వసతి, ఆసరా, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలు దేశమంతటా అమలు చేయాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్కు ఉద్యోగులు అంటే ప్రేమ అని, అందుకే ఏ రాష్ట్రంలోని లేనంత పీఆర్సీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం ఏర్పడిందని చెప్పారు. అప్పట్లో సమైక్య పాలకులు సంఘాన్ని కనీసం రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నాటి సీఎంలు వైఎస్ఆర్, కిరణ్కుమార్రెడ్డి ఎన్నో ప్రలోభాలు, బెదరింపులకు గురి చేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యోగులు ముందుండి నడిచారని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై అవగాహన ఉంది
ఉద్యోగి కుమారుడిగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. బదిలీలు, ఇంక్రిమెంట్లు మిశ్రంగా ఉంటాయన్నారు. 317 జీవోపై కొంత మంది ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తున్నారని, అందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఉద్యోగుల సర్దుబాటును చేపట్టిందని తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భవనానికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నానని ప్రకటించారు. కార్యక్రమంలో టీజీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, కార్యదర్శి కిరణ్కుమార్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు కృష్ణయాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్రావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి ప్రవీణ్తోపాటు ఐదు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెసా, యూనియర్ లెక్చరర్ అసోసియేషన్, ఎంపీవో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
-ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్
కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయలేదు
రాష్ట్రంలో ఉద్యోగుల ప్రభుత్వం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఉద్యోగులు, ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అధికారులు బాగా అమలు చేయడం వల్ల తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరుపున ఎన్నో అవార్డులు వస్తున్నాయని చెప్పారు.
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు