హనుమకొండ, ఫిబ్రవరి 20 : ఎల్ఐసీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకమని, అలాంటి సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెడుతుందని ప్ర భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హ నుమకొండ బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజన్ కా ర్యాలయంలో ఆదివారం జరిగిన ఎల్ఐసీ 35వ వార్షికోత్సవ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న ఎల్ఐసీ వాటాల విక్రయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశీయ, విదేశీ పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తుల ను కారుచౌకగా విక్రయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వ రంగసంస్థలను నిర్వీర్యం చేసే దిశగా కేం ద్ర ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమే కాకుం డా ఐపీవో పేరుతో ఎల్ఐసీలోని ప్రభుత్వ వాటాలు అమ్మివేయడానికి, సాధారణ బీమా సంస్థలను ప్రైవేట్పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు. కేంద్రం విధానాలు ప్రజల ప్ర యోజనాలకు అనుగుణంగా లేవన్నారు. బీమా రంగంలోని 245 ప్రైవేట్ కంపెనీలను కలిపి 1956లో అప్ప టి ప్రధాని జవహర్లాల్నెహ్రూ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం బీమా వ్యాపారాన్ని జాతీయం చేసిందన్నారు. ఇప్పుడు ఎల్ఐసీలో 5నుంచి 10శాతం వాటా ను ఉపసంహరించుకుని తద్వారా రూ.లక్ష కోట్ల సేకరణకు ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. ద్రవ్య లోటు ను పూడ్చుకోవడం కోసం లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తోందన్నారు.
రూ.1,75,000 కోట్లు సమీకరించాలనే డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంలో భా గంగా రూ.లక్ష కోట్లు ఎల్ఐసీలో వాటాలు అమ్మడం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తుందని చీఫ్ వి ప్ పేర్కొన్నారు. ప్రభుత్వం సంపన్నులపై ఎకువ ప న్ను విధించడానికి బదులుగా ప్రభుత్వ ఆస్తులను కా ర్పొరేట్లు, ధనిక వర్గాలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎల్ఐసీ పనితీరు గమనిస్తే ప్ర భుత్వం పెట్టిన రూ.100 కోట్ల మూలధనానికి ఎల్ఐసీ ఇప్పటి వరకు దాదాపు రూ.28వేల కోట్లు డివిడెండ్గా ఇచ్చిందని తెలిపారు. ప్రతి ఏడాది ఎల్ఐసీ లాభాల్లో 5 శాతంప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో, మిగిలిన 95 శాతం పాలసీదారులకు బోనస్గా పంపిణీ చేస్తుందన్నారు. ప్రజలకు ప్రాథమిక మౌలిక వసతులు కల్పించేందుకు ఎల్ఐసీ రూ.30 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందన్నారు. ఇది కాకుండా భారత ప్రభుత్వం అంతర్గత రుణాల్లో దాదాపు సంస్థ 25% నిధులు సమకూరుస్తుందన్నారు. ఎల్ఐసీ వద్ద రూ.38 లక్షల కోట్ల ఆస్తులు(దాదాపు 550 బిలియన్ డాలర్లు) ఉన్నాయని, ఇది ప్రపంచంలోని 75% దేశాల జీడీపీ క న్నా ఎక్కువ అని చీఫ్ విప్ పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ 99.86 పరిషార శాతంతో 2.29 కోట్ల క్లెయిమ్స్ని చెల్లించి, క్లెయిమ్ సెటిల్మెంట్లో మరోసారి ప్రపంచ నం బర్ వన్ అయిందన్నారు. క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది జీవిత బీమా కంపెనీల సామర్థ్యాన్ని తెలియజేస్తుందన్నారు.
భారతదేశంలోని మొత్తం జీవిత బీమా పరిశ్రమలో ఎల్ఐసీ అతి తకువ నిర్వహణ వ్యయాన్ని కలిగి ఉందన్నారు. ఎల్ఐసీ వాటాల ఉపసంహరణ నిర్ణయాన్ని పార్లమెంట్లో సమర్థించలేమనే వాస్తవం ప్రభుత్వానికి తెలుసని, అందుకే రహస్యంగా ఎల్ఐసీ చట్టం, 1956కు సవరణలను ఫైనాన్స్ బిల్లు 2021-22లో చేర్చారన్నారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ యాక్ ్ట(జీఐబీఎన్ఎ), 1972 నిబంధనలను కూడా సవరించారన్నారు. ఈ అప్రజాస్వామిక ప్రభుత్వ చర్యలు దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల సంతృప్తికేనన్నది సుస్పష్టం అవుతుందని చీఫ్ విప్ పేర్కొన్నారు. పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. అత్యుత్తమమైన ప్రభుత్వ రంగ ఆర్థిక దిగ్గజాలను రక్షించడం ప్రతి భారతీయుడి కర్తవ్యం అని చీఫ్విప్ పిలుపునిచ్చారు. ఎల్ఐసీలో పొదుపు చేయడం కొనసాగిస్తూ, బీమా ప్రీమియంపై జీఎస్టీని తొలగించేందుకు, ఐపీవోకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని చీఫ్ విప్ అన్నారు.