హనుమకొండ, అక్టోబర్ 19: వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు వచ్చే మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా సర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హ నుమకొండ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికా రులతో వేయిస్తంబాల దేవాలయ పునర్నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి, చీఫ్ విప్ మాట్లాడుతూ ఆయా పనులు పకడ్బందీ గా నాణ్యతతో చేపట్టాలన్నారు. చారిత్రక వరంగ ల్కు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన వేయి స్తంభాల గుడిని తిరిగి అదే స్థాయిలో పునర్ ని ర్మాణం చేయాలన్నారు. ఇప్పటికే వివిధ సాంకే తిక కారణాలతో జరిగిన ఆలస్యాన్ని మరిపించే లా వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించా రు.
ఆరియాలజీ విభాగం కింద ఉండడం, అప్ప టి నిర్మాణ కౌశలం సాండ్ టెక్నాలజీ కావడం వల్లనే గాక, ఆయా బరువైన రాళ్లను కూర్చడం కూడా కొంత ఆలస్యానికి కారణమని అధికారు లు మంత్రికి, చీఫ్ విప్కు వివరించారు. అయితే సమస్యలు ఏవైనప్పటికీ అధిగమించాలని వేయి స్తంభాల దేవాలయంతో పాటు వరంగల్ కోట, జైన మందిరంపై కూడా సమీక్షించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఇచ్చిన రూ. కోటే కాక, ఇంకా నిధులు అవసరమైతే సమకూర్చాలని వారు అధికారులను అదేశించారు. వేయి స్తంభా ల దేవాలయం, కుడా లాండ్ పూలింగ్ వంటి అం శాలపై కూడా వారు అధికారులకు తగు సూచన లు చేశారు. ఈ సమావేశంలో టూరిజం, సాంసృ తిక శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, కుడా అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్వోలు, పాండురంగారావు, వేయి స్తంభాల ఆలయ అర్చకుడు గంగు ఉపేద్రశర్మ, టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.