హనుమకొండ, జూన్ 7 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా 30వ డివిజన్ బాలసముద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, మల్లికాంబ మనోవికాస కేంద్రం, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గంలోని పలు కాలనీల్లో పారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారని వివరించారు. చాలా రోజులుగా పరిష్కారం కాని సమస్యలు పట్టణ ప్రగతి కార్యక్రమంతో సులువుగా పరిష్కారమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
పారులు, డ్రైనేజీలు, విద్యుత్ ఇతర అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. జరుగుతుందన్నారు. కార్పొరేటర్, 15 మందితో ఏర్పా టు చేసిన కమిటీ డివిజన్లోని సమస్యలను గుర్తించి పట్టణ ప్రగతి ద్వారా పరిష్కరిస్తారని చెప్పారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా క్లిష్టతరమైన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిషరించాలని చీఫ్ విప్ ఆదేశించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్ రావుల కోమలాకిషన్, టీఆర్ఎస్ నాయకులు కేశవరెడ్డి, రాంప్రసాద్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.