గణపురం : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ టీఎస్. దివాకర్ అన్నారు. గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన దళితులు ఇళ్ల నిర్మాణాల కొరకు గత నాలుగు రోజులుగా భూ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లా అడిషనల్ అప్పయ్యపల్లి గ్రామ దళితుల కుటుంబలతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా అమలు చేస్తామన్నారు.
ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం ఎటువంటి ఆదేశాలు రాలేదని, వస్తే తప్పకుండా నిరుపేద దళిత కుటుంభానికి కేటాయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.