కాకతీయ టెక్స్టైల్ పార్కులో శరవేగంగా యూనిట్ల నిర్మాణం
తుది దశకు గణేశ ఇకో స్పేర్ పరిశ్రమల పనులు
ఇకో టెక్ యూనిట్లో మరో నాలుగైదు నెలల్లో ఉత్పత్తి
ప్రత్యక్షంగా 800 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి
రూ.900 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన యంగ్వన్
262 ఎకరాలకు డబ్బు చెల్లించి ప్రభుత్వంతో ఒప్పందం
తాజాగా రంగంలోకి కేరళకు చెందిన కిటెక్స్ కంపెనీ
వరంగల్, ఆగస్టు 22(నమస్తేతెలంగాణ) :ఉత్పత్తి దిశగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పరుగులు పెడుతోంది. పార్కులో భారీ వస్త్ర పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరభారత సంస్థ గణేశ ఇకో స్పేర్ లిమిటెడ్ రెండు ప్రొడక్షన్ యూనిట్ల నిర్మాణం చేపట్టింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ సంస్థ రూ.900 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోగా, తాజాగా కేరళకు చెందిన కిటెక్స్ కంపెనీ కూడా ముందుకొచ్చింది. గణేశ ఇకో స్పేర్ లిమిటెడ్ ప్లాంట్లలో మరో నాలుగైదు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుండడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరకనున్నది.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్రమ ల యూనిట్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నా యి. వస్ర్తాల తయారీలో ప్రపంచ స్థాయి కంపెనీలు పా ర్కులో పెట్టుబడులు పెట్టాయి. ఇందులో గణేశ ఇకో స్పేర్ లిమిటెడ్ సంస్థకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రా ష్ర్టాల్లో భారీ వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి. దక్షిణ భారత దేశంలోనూ తమ వస్త్ర పరిశ్రమలు స్థాపించేందుకు తె లంగాణలో అడుగుపెట్టింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రెండు ప్రొడక్షన్ యూనిట్ల ఏర్పాటు కోసం దీనికి ప్రభుత్వం యాభై ఎకరాలు కేటాయించింది. ఇం దులో 30 ఎకరాలు గణేశ ఇకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్, 20 ఎకరాలు గణేశ ఇకో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేర ఒకేచోట ఇచ్చింది. వీటిలో గణేశ ఇకో పెట్లో ఫైబర్ యా న్ లైన్, గణేశ ఇకో టెక్లో వాషింగ్ లైన్ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు గణేశ ఇకో స్పేర్ లిమిటెడ్ సం స్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పార్కులో ఈ సంస్థ రెండు యూనిట్ల నిర్మాణ పనులు చేపట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తొలుత రెండు యూనిట్లకు వేర్వేరుగా చుట్టూ ప్రహరీ నిర్మించి బిల్డింగ్ ప్లాన్కు ఆమోదం లభించిన తర్వాత ప్లాంట్ల పనులు ప్రారంభించింది.
నాలుగైదు నెలల్లో ఉత్పత్తి..
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో గణేశ ఇకో స్పేర్ లిమిటెడ్ సంస్థ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,000 కోట్లు. ప్రస్తుతం తొలి విడుత రూ.300 కోట్లతో రెండు ప్రొడక్షన్ యూనిట్లను నిర్మిస్తోంది. గణేశ ఇకో పెట్ యూనిట్లో ఫైబర్ యాన్ లైన్ ప్రొడక్షన్, గణేశ ఇకో టెక్ లిమిటెడ్ యూనిట్లో వాషింగ్ లైన్ ప్రొడక్షన్ ప్లాంట్ల నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. వీటిలో గణేశ ఇకో టెక్ లిమిటెడ్ యూనిట్లో పాలిస్టర్ క్లాత్ తయారయ్యే దారం (పాలి ప్రొక్లిన్ ఫైబర్) ఉత్పత్తి కానుంది. ప్రతిపాదిత ప్లాంట్లలో ఒక ప్లాంటు నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. ఈ ప్లాంటులో మరో నాలుగైదు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గణేశ ఇకో స్పేర్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దశల వారీగా ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ యూనిట్ పక్కనే గణేశ ఇకో పెట్ యూనిట్లోనూ ప్లాంట్ల నిర్మాణ పనులు ఉద్యమంలా నడుస్తున్నాయి. రెండు యూనిట్లలో నెలకొల్పే వస్త్ర పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా 800 మందికి ఉపాధి లభించనుందని, పరోక్షంగా మరో 1,500 మందికి ఉపాధి కలుగనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
262 ఎకరాల్లో యంగ్వన్..
దక్షిణ కొరియా సంస్థ యంగ్వన్కు ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 300 ఎకరాలు కేటాయించింది. ఇందులో రోడ్లు, ఇతర అవసరాలకు పోగా 262 ఎకరాల కోసం యంగ్వన్ ఇటీవల ప్రభుత్వానికి డబ్బు చెల్లించింది. ఈ 262 ఎకరాల్లో రూ.900 కోట్ల పెట్టుబడితో వస్త్ర పరిశ్రమలు స్థాపించేందుకు ఎంవో యూ కుదుర్చుకుంది. త్వరలో టీఎస్ఐఐసీ ద్వారా 262 ఎకరాలకు సంబంధించి సేల్ అగ్రిమెంట్ చేసుకోనుంది. ఆ తర్వాత వెంటనే ఈ 262 ఎకరాల్లో ఇంటర్నల్ లేఔట్ పనులు చేపట్టనుంది. సాధ్యమైనంత త్వ రలో టీఎస్ఐఐసీ నుంచి బిల్డింగ్ ప్లాన్కు ఆమోదం పొంది 262 ఎకరాల్లో వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులు మొదలుపెట్టనుంది. ప్రఖ్యాత సంస్థ కావటం వల్ల ని ర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించనుంది. యంగ్వన్ ఇక్కడ నెలకొల్పే వస్త్ర పరిశ్రమల్లో ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి లభించనుందని టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్రాథోడ్ చెప్పారు. కేరళకు చెందిన కిటెక్స్ కంపెనీ కూడా టెక్స్టైల్ పార్కు లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇటీవల ఈ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి మెగా పా ర్కును సందర్శించారు. కిటెక్స్ కంపెనీ ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేయడంపై కసరత్తు జరుగుతోంది.