న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 మందికి కరోనా బారినపడ్డారు. వైరస్ బారినపడిన వారిలో 3,57,295 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
4,209 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కొవిడ్ కేసులు 2,60,31,991కి పెరిగాయి. ఇప్పటివరకు 2,27,12,735 మంది కోలుకున్నారు. మరో 30,27,925 యాక్టివ్ కేసులున్నాయి. 2,91,331 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణశాఖ తన నివేదికలో పేర్కొంది. 19.18 కోట్ల మందిపైగా వ్యాక్సిన్ వేసినట్లు స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.