సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు
హుజూరాబాద్పై ఎగిరేది గులాబీ జెండానే
బీజేపీలో ఎందుకు చేరాడో ఈటల చెప్పాలి
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
కమలాపూర్లో టీఆర్ఎస్ యువ సమ్మేళనం
కమలాపూర్, జూలై 4 : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారిందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఆదివారం కమలాపూర్లో టీఆర్ఎస్ యువ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి టీఆర్ఎస్లో చేరాడని తప్పుడు ప్రచారం చేసి గెలుపొందారన్నారు. దీంతో రెచ్చిపోయిన బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇవ్వడంతో ప్రజలు బొందబెట్టారని గుర్తుచేశారు. ఆగస్టు 9 నుంచి బండి సంజయ్ చేసేది ప్రజాస్వామ్య యాత్ర కాదని, హుజూరాబాద్ ఎన్నికల యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో జేజేపీ నాయకులను నిలదీయాలన్నారు. మోడీ ప్రభ్వుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ్ముడిలా భావించి ఈటల రాజేందర్కు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఫ్లోర్ లీడర్గా, రెండు సార్లు మంత్రి పదవులు ఇస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నాడని ఆరోపించారు. ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితో సమ్మె చేయించాడన్నారు.
పూణే, బెంగళూరులో రహస్యంగా సమావేశాలు పెట్టాడని అన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమని, తెలంగాణకు వ్యాక్సిన్ ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేసిందని తిట్టిన ఈటల అదే పార్టీలో ఎందుకు చేరాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో జరిగేది ఢిల్లీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి పోటీ అన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, బలంగా ఉన్న సమయంలో 2003లో చేరిన ఈటల రాజేందర్ తానే గులాబీ ఓనర్నని అన్నాడన్నారు. ఇప్పుడు పార్టీని వీడి ఎందుకు పోయిండో ప్రజలకు సమాదానం చెప్పాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నాయన్నారు. యువత బీజేపీ ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఉప ఎన్నికల్లో యువత సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్బాబు, మండల ఇన్చార్జి పేరియాల రవీందర్రావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, సోషల్ మీడియా ఇన్చార్జి దినేశ్, కళాకారుడు సాయిచంద్, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, సర్పంచ్లు సాంబయ్య, కట్కూరి విజయ, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గులాబీమయమైన కమలాపూర్
టీఆర్ఎస్ యువ సమ్మేళనం చేపట్టడంతో ఆదివారం కమలాపూర్ గులాబీ మయమైంది. కమలాపూర్-గూడూరు గ్రామాల మధ్య నిర్వహించిన యువ సమ్మేళనానికి మండలంలోని 23 గ్రామాల నుంచి యువకులు ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున తరలివచ్చారు. 3వేల మంది యువకులు వస్తారని అంచనా వేయగా ఆరు వేలమంది వరకు రావడంతో టీఆర్ఎస్ నాయకుల్లో జోష్ నింపింది. సమావేశంలో కళాకారుడు సాయిచంద్ పాటకు కోరస్ ఇస్తూ గంట పాటు సభను ఉర్రూతలూగించడంతో యువకులు, రైతులు గులాబీ జెండాలతో చిందేశారు. సర్పంచ్ కట్కూరి విజయ, సాంబయ్య, విజేందర్రెడ్డి, రవీందర్, లింగమూర్తి, ఎంపీటీసీ భాస్కర్రావు, వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి కన్వీనర్ శ్రీనివాస్