సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 28: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ జిం దం కళ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. మ్యానిఫెస్టో కరపత్రాల ను ఇంటింటికీ పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీల అధ్యక్షులు పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 28: బోయినపల్లి వినోద్కుమార్కే ఓటేసి, పట్టం కట్టాలని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో ఇంటిం టా ప్రచారం చేశారు. మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ నేత లు ప్రచారం చేశారు.
కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ సర్పంచ్ కోడం సంధ్యరాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సద్దరోజా, క్యారం జగత్కుమార్, పడిగెల రాజు, కందుకూరి రామాగౌడ్, భానుమూర్తి, అనిల్గౌడ్, భిక్షపతి, తిరుపతి, రమేశ్, మనోహర్, సంతోష్, విజయ్, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ 24 వవార్డు పరిధిలో కౌన్సిలర్ బుర్ర లక్ష్మి, మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచా రం చేశారు. ఇంటింటా కరపత్రాలను పంచు తూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశా రు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలున్నారు.
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 28: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ముమ్మర చేశారు. బండలింగంపల్లిలోమండల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు ప్రచారం చేశారు. పార్లమెంటు అభ్యర్థిగా వినోద్కుమార్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇక్కడ పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు పిల్లి కిషన్, బాల్రాజ్నర్సాగౌడ్, తడుకల స్వామి, గుల్లపల్లి నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
గంభీరావుపేట, ఏప్రిల్ 28: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని బీఆర్ఎస్ నేతలు బూత్ స్థాయిలో వినోద్కుమార్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గతంలో ఐదేళ్లపాటు కరీంనగర్ పార్లమెంట్ మెంబర్గా వినోద్కుమార్ చేసిన సేవలకు తిరిగి పట్టం కడుదామని వారు ఓటర్లకు అవగాహన చేస్తూ ప్రచారం చేశారు. ఇక్కడ మాజీ ఎంపీటీసీ ఎగదండి స్వామి, నేతలు ధన్రాజ్, ఎగదండి రవి, అర్జున్, ఇరిగి సందీప్, బాలరాజు ఉన్నారు.
రుద్రంగి, ఏప్రిల్ 28 : ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కరానికి గతంలో కేంద్రంతో పోరాడి నిధులు మంజూరు చేయించిన బోయినపల్లి వినోద్కుమార్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ గంగం స్వరూపారాణి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం కోరారు. రుద్రంగి మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఇక్కడ గ్రామాధ్యక్షుడు దయ్యా ల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు మహేశ్, మంచె రా జేశం, చెప్యాల గణేశ్, నాగులపెల్లి రవి, దయ్యాల పెద్దులు, పూదరి శ్రీనివాస్, తర్రె గంగారెడ్డి, నరేశ్, మోహన్ ఉన్నారు.
బోయినపల్లి, ఏప్రిల్ 28 : మోసం చేసే పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. విలాసాగర్, కొదురుపాక గ్రా మాల్లో ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్ర చారం నిర్వహించారు. ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకులు చెన్నాడి అమిత్కుమార్, మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత, సత్తినేని మాధవ్, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి, మండలాధ్యక్షుడు కొండయ్య, నాయకులు అంజన్రావు, వేణుగోపాల్రావు ఉన్నారు.