వనపర్తి : త్వరలో సీఎం కేసీఆర్చేతుల మీదుగా వేరుశనగ పరిశోధన కేంద్రానికి శంకుస్థానప చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని పెద్దమందడి మండలంలోని వీరాయపల్లి గ్రామంలోని వేరుశనగ పరిశోధన కేంద్రానికి ఇదివరకే కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్జిల్లా పర్యటన చేయనున్నారని పర్యటనలో భాగంగా పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. సమయం ఎక్కువగా లేనందున వీలైనంత త్వరగా చదును చేసే పనులను పూర్తిచేయాలని అన్నారు.
జిల్లాలో నాణ్యమైన వేరుశనగ పండుతుంది కావున పరిశోధన కేంద్రం జిల్లాలో ఉంటే ఇంకా మంచి రకాలైన వేరుశనగ వంగడాలను అందించవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే