న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే సచేతి కరోనా వైరస్ బారిన పడి మృతిచెందారు. గత కొన్ని రోజులుగా దవాఖానాలో చికిత్స పొందుతున్న 56 ఏండ్ల సచేతి.. మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సచేతి మృతిపై బీఎఫ్ఐ, అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబా) సంతాపం వ్యక్తంచేశాయి.