వనపర్తి, సెప్టెంబర్ 30 : ఆధునిక సమాజంలో పక్కవారి గురించి ఆలోచించే సమయం కూడా లేకుం డా పోతున్నది. ఒకప్పుడు రక్తదా నం చేయాలంటే చాలా మంది ముం దుకు వచ్చేవారు. నేడు ‘ఫలానా గ్రూప్ రక్తం అవసరం ఉంది.. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలి’ అంటూ వాట్సాప్లలో నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఎవరో ఒకరు మాత్రమే ముం దుకొస్తున్నారు. ప్రముఖుల బర్త్డేలు వంటి సమయాల్లో ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరిస్తున్నారు. రోడ్డు ప్ర మాదాలు జరిగినప్పుడు తీవ్ర రక్తస్రావాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సందర్భాల ను చూస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో రక్తం అవసరమైతే మాత్రం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం. విపత్కర సమయంలో రక్తదానం చే సే వ్యక్తి బాధితుల పాలిట దైవసమానుడే. మనిషి శరీరం లో అవయవాలు పని చేయాలంటే రక్తం ప్రధానం. రక్త ప్రమేయం లేకుండా శరీరంలో ఏ భాగం పని చేయదు. సాధారణంగా మనిషి శరీరంలో సుమారుగా 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. లీటర్ రక్తంలో 4 నుంచి 11 మిలియన్ల తెల్ల రక్తకణాలు, 5 మిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉం టాయి. రక్తంలో 54 శాతం ప్లాస్మా, 46 శాతం సెల్స్ ఉంటాయి. నేడు జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగానైనా ఇక నుంచి రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు ఉండి కనీస బరువు 45 కిలోలు ఉన్న వారు రక్తదానం చేయొచ్చు. రక్తంలో కనీసం 12.5 గ్రాములు హిమోగ్లోబిన్ ఉండాలి. హెచ్ఐ వీ, సిఫిలిస్, హెపటైటిస్, మలేరియా, క్యానర్స్, హైబీపీ, క్షయ వంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయొద్దు.
రక్తదానంతో ప్రయోజనాలు..
మానవత్వాన్ని చాటుకోండి..
ఆపదలో ఉన్న సమయంలో రక్తదానం చేసి మానవత్వాన్నిచాటుకోవాలి. రక్తదానం చేయడం వల్ల దాతలకు ఎలాంటి నష్టం కలగదు.రక్తదాన శిబిరాల్లో యువకులు,రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. రక్తదానంపై పలుఅవగాహన కార్యక్రమాలతోపాటు జిల్లా వ్యాప్తంగా శిబిరాలు
నిర్వహిస్తున్నాం.