యాలాల : క్షయ వ్యాధిగ్రస్తులు మనోధైర్యంతో జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులను వాడితే క్షయ వ్యాధి పూర్తిగా తగ్గుతుందని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ అన్నారు. బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఇంద్రనగర్, హమాలీ బస్తీ, పాత తాండూర్లో టీబీ రోగులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలి మందగించడం, బరువు తగ్గడం, దమ్ము, దగ్గు, వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలన్నారు.
గతంలో క్షయ వ్యాధి వస్తే వ్యాధిగ్రస్తులు తగ్గించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. కాని నేడు వ్యాధి నిర్దారన అయితే డాక్టర్ సలహా మేరకు ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడి పూర్తిగా వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చన్నారు. టీబీ రహిత పట్టణంగా మార్చుకునే దిశగా ప్రతి ఒక్కరూ ధృడ సంకల్పంతో పని చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ స్పందన, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ అరుణ్ కుమార్, సూపర్వైజర్ అంబిక, ఏఎన్ఎమ్ రేణుక పాల్గొన్నారు.