వికారాబాద్ : నవాబ్పేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన పెంటయ్య గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ జూలై 2న మృతి చెందాడు. కుటుంబ యజమాని మృతితో బతుకు భారమై భార్య ప్రమీళ కలెక్టర్కు అర్జిపెట్టుకుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖీల బాధితురాలు మర్పల్లి ప్రమీల పెట్టుకున్న అర్జిని పరిశీలించి పులుమామిడి గ్రామంలో ఉన్న బ్యాంక్ ద్వారా రూ. 50వేలు ఆర్థిక సాయం (రుణం) అందించాలని బ్యాంక్ మేనేజర్ స్వాతిని ఆదేశించారు. లీడ్ బ్యాంక్ జిల్లా అధికారి రామ్బాబు కలెక్టర్ నిఖిలతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితురాలికి చెక్కును అందించారు. ఈ డబ్బులతో కిరాణ షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాలని కలెక్టర్ సూచించారు.