కులకచర్ల, మార్చి 11 : అక్రమంగా తరలిస్తున్న 80 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం..అక్రమంగా బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు.. టాస్క్ఫోర్స్ పోలీసులు కులకచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో దాడులు నిర్వహించారు.
ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారుగా 80 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. గ్రామానికి చెందిన గందె రమేశ్ నుంచి 50 క్వింటాళ్లు, ముస్కర్ల రాములు నుంచి 25 క్వింటాళ్లు, గందె ప్రవీణ్ నుంచి 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.