కొడంగల్, ఆగస్టు : తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతోత్సవాలు శుక్రవారం మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తసీల్దార్ ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అలుపెరగని పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఎల్లవేళలా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది గోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.